Manipur Protest | న్యూఢిల్లీ, జూలై 18: మణిపూర్లో ఎక్కడో ఒకచోట హింస కొనసాగుతూనే ఉన్నది. ఈ నెల 15న తూర్పు ఇంఫాల్లో మానసిక అనారోగ్యంతో బాధ పడుతున్న నాగా మహిళ(55) హత్యకు గురయ్యారు. ఆమె హత్యకు మైతీ తెగవారే కారణమని యూఎన్సీ ఆరోపించింది.
ఈ ఘటనను నిరసిస్తూ సోమవారం ఐక్య నాగా మండలి(యూఎన్సీ), గిరిజన ఐక్యత కమిటీ(సీఓటీయూ) బంద్కు పిలుపునివ్వడంతో ప్రజా జీవనం స్తంభించింది. మరోవైపు కుకీ-జో తెగ ప్రజలపై మైతీలు దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ సీఓటీయూ ఆదివారం రాత్రి నుంచి 72 గంటల బంద్కు పిలుపునిచ్చింది.