ఇంఫాల్: మణిపూర్ గవర్నర్ అనసూయి యూకీకి కుకీ గిరిజన మహిళల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. బుధవారం ఉదయం చురాచాంద్పూర్ పట్టణంలో గవర్నర్ పర్యటనను గిరిజన మహిళలు అడ్డుకున్నారు. మైతీలు అత్యధికంగా ఉన్న రాజధాని ఇంఫాల్లో తాము అడుగుపెట్టే పరిస్థితి లేదని, తమకు ప్రత్యేక పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని వారు గవర్నర్ను డిమాండ్ చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజనుల డిమాండ్ను పలు వేదికలపై ప్రస్తావిస్తానని, తనను ముందుకు వెళ్లనివ్వాలని గవర్నర్ వారిని కోరారు. మే 3న మొదలైన మణిపూర్ అల్లర్లలో వేలాదిమంది కుకీ గిరిజనులు శరణార్థులుగా మారారు. ఘర్షణల్లో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.