డీఎంహెచ్వో భాస్కర్ నాయక్
ఇల్లెందు, ఏప్రిల్ 8 : ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలని డీఎంఅండ్హెచ్వో భాస్కర్నాయక్ అన్నారు.గురువారం ఇల్లెందు, రోంపేడు, కొమరారం పీహెచ్సీ వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భాస్కర్నాయక్ మాట్లాడుతూ కరోనా పరీక్షలు ముమ్మరంగా నిర్వహించాలన్నారు. కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పించి తగు జాగ్రత్తలను సూచించాలన్నారు. మాస్క్లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలలో నెలకొన్న అపోహలు, సందేహాలను నివృత్తి చేసి వ్యాక్సిన్ వేసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించి ఇచ్చిన టార్గెట్లను పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో వినోద్, వైద్యులు వరుణ్, సురేశ్, శ్రీలత, రాజశేఖర్ రవిచంద్ తదితరులు పాల్గొన్నారు.