మంగుళూరు: కర్నాటకలోని మంగుళూరు(Mangaluru) కోర్టు 51 ఏళ్ల వ్యక్తికి మరణశిక్ష విధించింది. పోక్సో కేసులో విచారణ చేపట్టారు. 13 ఏళ్ల మైనర్ బాలికను అత్యాచారం, మర్డర్ చేసిన కేసులో ఈ విచారణ జరిగింది.అదనపు జిల్లా సెషన్స్ జడ్జు కేఎస్ మన్నూ శుక్రవారం ఈ కేసులో ఆదేశాలు జారీ చేశారు. నిందితుడు ఫకీరప్ప హనుమప్ప మదరపై పలు కేసులు ఉన్నాయి. బెల్గావి జిల్లాలోని సావదత్తి తాలూకాలోని హంచినాల్ గ్రామం అతని స్వస్థలం. 2024, ఆగస్టు 6వ తేదీన మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాధిత బాలికను నిందితుడు హత్య కూడ చేశాడు.
పన్నంబుర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న అమ్మాయిపై నిందితుడు అఘాయిత్యం చేశాడు. కిరాయి ఇంట్లో ఉంటున్న అతను..ఎవరూ లేని క్షణంలో ఇంట్లోకి ప్రవేశించి రేప్, మర్డర్కు పాల్పడ్డాడు. భారతీయ న్యాయ సంహిత చట్టంలోని సెక్షన్ 103(1) కింద నిందితుడికి మరణశిక్ష ఖరారు చేశారు. దీంతో పాటు జీవితకాల శిక్షను కూడా వేశారు. పోక్సో చట్టం కింద 50వేల జరిమానా విధించారు. బీఎన్ఎస్లోని 332(ఏ) సెక్షన్ కింద జీవితకాల శిక్షను వేశారు.