మండి: హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న వర్షాల వల్ల బియాస్ నది ఉప్పొంగుతోంది. ఆ నదీ పరీవాహక ప్రాంతంలో మండి నగరంలో ఉన్న పంచ్వక్త్రా ఆలయం( Panchvaktra temple) విశిష్టమైంది. ఆ ప్రదేశంలో ఉన్న ప్రకృతి అందాలు ఆ ఆలయానికి భక్తుల్ని ఆకర్షిస్తుంది. రెండు రోజులుగా కురుస్తున్న వానల వల్ల.. బియాస్ ఉప్పొంగుతోంది. ఆ నదీ ప్రవాహ నీరు ఆలయాన్ని చుట్టుముట్టేసింది. శివుడు కొలువై ఉన్న ఆ ఆలయంలో స్థానికలు పూజలు చేస్తుంటారు. టూరిస్టులను కూడా ఆ గుడి ఆకర్షిస్తుంది.
#WATCH | Himachal Pradesh: Mandi's Panchvaktra temple has been submerged in water due to a spate in the Beas river following incessant heavy rainfall. pic.twitter.com/sk7wjpbnah
— ANI (@ANI) July 10, 2023
పంచ్వక్త్రా ఆలయంలో శివుడు అయిదు ముఖాలతో ఉంటాడు. కానీ ముందు నుంచి చూస్తే ఆ విగ్రహంలో మూడు ముఖాలు మాత్రమే కనిపిస్తాయి. ఆ ఆలయం ప్రస్తుతం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. దీన్ని జాతీయ వారసత్వ సంపదగా గతంలో ప్రకటించారు. పంచ్వక్త్రా ఆలయంలోని శివుడు అయిదు ముఖాలు ప్రత్యేకమైనవి. అఘోర, ఇషానా, తత్ పురుష, వామదేవ, రుద్ర రూపాలను ఆ విగ్రహంలో చూడవచ్చు.
శివుడి ఆఘోర రూపం విధ్వంసానికి ప్రతీక. ఇషానుడంటే అంతటా వ్యాపించినవాడు. తత్ పురుషుడంటే ఈగోకు సంకేతం. వామదేవ రూపం మహిళా శక్తికి సూచకం. రుద్రుడు అంటే సృష్టికి, వినాశనానికి సంకేతంగా చూస్తుంటారు. అయితే పంచ్వక్త్రా ఆలయం అంటే.. ఈ అయిదుగురి ఐకమత్యమే. నిజానికి ఆ ఆలయానికి ఎప్పుడు పునాది పడిందో స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ చారిత్రాక ఆధారాల ప్రకారం సిద్సేన(1684 నుంచి 1727) పాలన సమయంలో దీన్ని పునర్ నిర్మించారు. నాలుగు చిన్నపాటి పిల్లర్లపై ప్రధాన మండపం నిర్మితమై ఉంటుంది.
When many modern & mammoth structures r collapsing within a few minutes then this many centuries-old #Panchvaktra_Temple of #Mandi is still confronting the flood.
In the past many times, this temple confronts heavy floods.#BeasRiver #HimachalFloods #HimachalPradesh #Kullu #Manali pic.twitter.com/bc4kvnGweP— ViCky ThAkur ! (@imsandeep02) July 10, 2023
పంచ్వక్త్రా ఆలయ పరిసరాలు అత్యంత ప్రశాతంగా ఉంటాయి. అక్కడి సౌందర్యం ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. బియాస్ నది పరవళ్లు చూపరుల్ని సమ్మోహన పరుస్తుంటాయి. ప్రశాంత చిత్తంతో ఇక్కడే ఎంతో మంది భక్తులు ప్రార్థనలు చేస్తుంటారు. ఆనందభరితమైన ఇక్కడి వాతావరణం .. మానసిక ఆరోగ్యాన్ని పరిపుష్టి చేస్తుంది. పంచ్వక్త్రా గుడి నిజంగానే ప్రతిష్టాత్మక వారసత్వ సంపద అని చెప్పడంలో సందేహం లేదు.
బియాస్, సుకేతి నదుల సంగమ ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మండి పట్టణాన్ని చోటీ కాశీ అని కూడా అంటారు. ఈ పట్టణంలో సుమారు 80 శివుడి ఆలయాలు ఉన్నాయి. దాంట్లో పంచ్వక్త్రా ఒకటి. ఇక్కడి ఆర్కిటెక్చర్, స్టోన్ కార్వింగ్స్ భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. పట్టణాకి వచ్చే ప్రతి టూరిస్టు ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే. సాధారణంగా శివరాత్రి వేళ ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది.