దరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 19న తెలంగాణ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్, తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సంయుక్తాధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ బుధవారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడించారు.
బెస్ట్ న్యూస్ పిక్చర్, పదేండ్లలో వివిధ రంగాల్లో తెలంగాణ అభివృద్ధి ప్రతిబింబించే చిత్రాలు, ప్రాచీన కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు, పల్లె అందాలు, జాతరలు, పండుగలు, కళారూపాల క్యాటగిరీల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆగస్టు 5వ తేదీలోగా ఎంట్రీలను పంపించాలని సూచించారు. ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి ఆగస్టు 16 నుంచి 19 వరకు రవీంద్రభారతిలో ప్రదర్శన ఉంటుందని, చివరి రోజున అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని వివరించారు. మొదటి బహుమతికి రూ.10 వేలు, ద్వితీయ రూ.5 వేలు, తృతీయ రూ.3 వేల నగదు అందజేయనున్నట్టు తెలిపారు.