న్యూఢిల్లీ: వారిద్దరు దోస్తులు. ఒకరి అవసరం నిమిత్తం మరొకరి దగ్గర డబ్బు బదులు తీసుకున్నాడు. ఫలానా తేదీ నాడు తిరిగిస్తా అని చెప్పాడు. అయితే చెప్పిన తారీఖులోపు పైసలు ఇవ్వలేకపోయాడు. ఇద్దరి మధ్య గొడవజరిగింది. ఈ క్రమంలో డబ్బిచ్చినవాడు.. తీసుకున్నవాడిని తీవ్రంగా కొట్టాడు. దీంతో అతడు మృతిచెందిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఢిల్లీలోని త్రినగర్కు చెందిన దీపక్, విశాల్ స్నేహితులు. అవసరం నిమిత్తం విశాల్ వద్ద దీపక్ రూ.500 తీసుకున్నాడు. పది రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పాడు. అయితే చెప్పిన సమయానికి డబ్బు ఇవ్వకపోవడంతో దీపక్పై విశాల్ దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు దవాఖానకు తరలించారు. చికిత్స పొందతూ దీపక్ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ క్రమంలో నిందితుడు విశాల్ను అరెస్టు చేశారు. దీపక్ను తొడల మధ్యలో బలంగా కొట్టినట్లు విచారణలో వెల్లడయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో విచారణ కొనసాగుతున్నదని వెల్లడించారు.