Tragedy averted Gujarat | గుజరాత్లో ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్ పర్యటనలో విషాదం జరక్కుండా కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అహ్మదాబాద్లో కేజ్రీవాల్, భగవంత్ మాన్ శనివారం రోడ్షో నిర్వహించారు. ఈ రోడ్ షో సందర్భంగా బహుళ అంతస్తుల భవనంపై నుంచి ఓ వ్యక్తి కింద పడిపోబోయాడు. కొందరు వ్యక్తులు సదరు బాధితుడ్ని రక్షించారు. ఆ భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరుకున్నట్లు కనిపిస్తున్నది.
ఈ వీడియోను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరలైంది. కేజ్రీవాల్, భగవంత్ మాన్ వెంట ఉన్న కొందరు వ్యక్తులు ఆ భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం కనిపించింది.
అంతకుముందు రోడ్షోలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గుజరాత్ను పాలించేందుకు తమ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని గుజరాతీలను కోరారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. కేజ్రీవాల్, భగవంత్ మాన్ దాదాపు రెండు కి.మీ. దూరం రోడ్ షో నిర్వహించారు. రోడ్ షో పొడవునా ఆప్ కార్యకర్తలు త్రివర్ణ పతకాలతో అలంకరించారు.