బెంగళూరు: ఫుట్పాత్పై నడుస్తున్న ఐదుగురిపైకి ఒక కారు దూసుకెళ్లింది. (Man Runs Car Over) ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. బుధవారం సాయంత్రం 4 గంటలకు లేడీహిల్ సమీపంలోని ఫుట్పాత్పై ఇద్దరు మహిళలు, ముగ్గురు బాలికలు నడిచి వెళ్తున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ఒక కారు వారి మీదకు దూసుకెళ్లింది. దీంతో వారంతా ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. మృతురాలిని 23 ఏళ్ల రూపశ్రీగా గుర్తించారు. మరో మహిళ, ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా, ఈ సంఘటన అనంతరం కారు డ్రైవ్ చేసిన కమలేష్ బల్దేవ్ ఒక కార్ షోరూమ్ ముందు తన కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఈ నేపథ్యంలో అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#JustIn: Horror on #Mangaluru street. speeding car knocked down a 23-yr-old woman & 4 girls who were walking on footpath near LadyHill area. Woman lost her life while 4 girls sustained multiple injuries. Reports @deepthisTOI. @TOIBengaluru #Karnataka #RoadSafety #Pedestrian pic.twitter.com/msAEVAPTBf
— Niranjan Kaggere (@nkaggere) October 18, 2023