న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఈ కామర్స్ దిగ్గజాలు దివాళీ సందర్భంగా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులను తక్కువ ధరలకే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపారు. అయితే మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఫ్లిఫ్కార్ట్ నుంచి ల్యాప్టాప్కు ఆర్డర్ ఇవ్వగా, ల్యాప్టాప్కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ను పంపడంతో అతడు షాక్కు గురయ్యాడు. తనకు ఎదురైన అనుభవాన్ని చిన్మయ రమణ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
The product video pic.twitter.com/Lbv2INZsjk
— Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022
డెలివరీకి సంబంధించిన ఫోటోలను ఆయన పోస్ట్లో జోడించారు. ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్లో ల్యాప్టాప్కు ఆర్డరిస్తే పెద్ద రాయి, ఈ-వేస్ట్ పంపారని రమణ రాసుకురాగా, ఫాలోఅప్ పోస్ట్లో మరిన్ని వివరాలు ప్రస్తావించారు. ప్రతిసారి ఫ్లిప్కార్ట్ను ఎంపిక చేసుకుంటున్నందుకు ఇవాళ విచారిస్తున్నానని, మీరెవ్వరూ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేయవద్దని ఏదైనా పొరపాటు జరిగినా వారు మీకు సాయపడరని పేర్కొన్నాడు. మీరు కూడా నాలాగే నిస్సహాయులుగా మారతారని హెచ్చరించాడు.
ఈ పోస్ట్లో రమణ ప్యాకేజ్ అన్బాక్సింగ్ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ సమస్యను ఫ్లిప్కార్ట్ పరిష్కరించదని ఆయన ఆశలు వదిలేసుకోగా ఎట్టకేలకు కంపెనీ రంగంలోకి దిగి రమణ వెచ్చించిన మొత్తాన్ని రిఫండ్ చేసింది. ఈ కేసులో ఫ్లిప్కార్ట్ తనకు వెన్నంటి నిలిచిందని, వారు తనకు రిఫండ్ చేశారని ఫాలో అప్ పోస్ట్లో రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ను చూసి పెద్దసంఖ్యలో నెటిజన్లు స్పందించారు. ఈ కామర్స్ వేదికల నుంచి తమకు ఎదురైన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్లో బీహార్కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో డ్రోన్ కెమెరాకు ఆర్డర్ ఇవ్వగా దానికి బదులు ఆలు బ్యాగ్ రావడంతో కంగుతిన్నాడు.