న్యూఢిల్లీ: జార్ఖండ్ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా-రాజధాని ఎక్స్ప్రెస్ (Sealdah-Rajdhani Express) రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. జార్ఖండ్లోని ధన్బాద్ రైల్వే స్టేషన్లో రైలెక్కిన హర్విందర్ సింగ్ (41) అనే వ్యక్తి.. కాసేపటికే ఆ రైల్లోని కోచ్ అటెండెంట్తో గొడవకు దిగాడు. మాటామాటా పెరగడంతో తన దగ్గరున్న పిస్తోల్ తీసి కాల్పులు జరిపాడు.
దాంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు నిందితుడిని పట్టుకుని కొడెర్మా రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించారు. అనంతరం స్థానిక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకెళ్లారు. నిందితుడికి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా నిందితుడి కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.