చండీగఢ్: ఒక వ్యక్తి తన స్నేహితురాలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమె కారులో పారిపోయాడు. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన అతడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. (Man Kills woman Friend) పంజాబ్లోని మొహాలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న 27 ఏళ్ల ఏక్తా, ఖరార్ ప్రాంతంలోని సన్నీ ఎన్క్లేవ్లో నివసిస్తున్నది. శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చింది. స్నేహితుడైన 30 ఏళ్ల అనాస్ ఖురేషీ ఆమె ఇంటికి వచ్చాడు. కత్తితో పొడిచి ఏక్తాను హత్య చేశాడు. అనంతరం ఆమె కారులో అక్కడి నుంచి పారిపోయాడు. హర్యానాలోని షహాబాద్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
కాగా, తీవ్రంగా గాయపడిన ఖురేషీ, చండీగఢ్లోని ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. కోలుకున్న తర్వాత అతడ్ని అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన అతడు చండీగఢ్లో ఈటరీ నిర్వహిస్తున్నాడని పోలీసులు తెలిపారు. స్నేహితురాలు ఏక్తాను అతడు హత్య చేయడానికి కారణం ఏమిటో తెలియదని అన్నారు. ఏక్తా ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు ఆమె కారులో పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.