లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్ధితి నానాటికీ దిగజారుతోంది. భాగేశ్వర్ ధామ్కు చెందిన స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని చంపేస్తానని (Death Threat) బెదిరించిన వ్యక్తిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రాంలో ధీరేంద్ర శాస్త్రిని చంపేస్తామని బెదిరిస్తూ పోస్ట్ చేసిన బరేలికి చెందిన అనస్ అన్సారీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని రాయ్బరేలి ఎస్పీ రాజ్ కుమార్ అగర్వాల్ వెల్లడించారు.
సోషల్ మీడియా పోస్ట్కు సంబంధించి స్ధానిక హిందూ గ్రూప్ సభ్యులు ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఆపై అన్సారీని అరెస్ట్ చేశారు. అన్సారీపై హఫీజ్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Read More :