థానే: భార్యను చంపిన కేసులో భర్తకు జీవితకాల శిక్షను ఖరారు చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. 2015లో ఆర్థిక అంశాలపై భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఆ సమయంలో 63 ఏళ్ల వ్యక్తి తన భార్యను హతమార్చాడు. బుధవారం థానే అదనపు సెషన్స్ జడ్జి రచన ఆర్ తెహ్ర ఈ కేసులో ఆదేశాలు ఇచ్చారు. నిందితుడు హీరాలాల్ మాలికి 5వేల జరిమానా కూడా విధించారు. భార్య, పిల్లలతో కలిసి హీరాలాల్ కలిసి జీవించేవాడు. అయితే ఎప్పుడూ డబ్బు విషయంలో గొడవలు జరిగేవి. 2015, అక్టోబర్ 13వ తేదీన కూడా ఘర్షణ జరిగింది. ఐరన్ రాడ్తో భార్యను కొట్టి చంపాడు భర్త.