న్యూఢిల్లీ : ఓ ఆర్టిస్ట్ తాజ్మహల్ చిత్రాన్ని గీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్దేవ్ అనే ఆర్టిస్ట్ ఈ వీడియోను ఇన్స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 2.9 కోట్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో ఆర్టిస్ట్ బ్లాక్బోర్డ్పై చాక్పీస్తో డ్రాయింగ్ చేస్తూ కనిపించాడు.
వీడియోలో మొదట బ్లాక్బోర్డ్పై తాజ్మహల్ అని ఆర్టిస్ట్ ఇంగ్లీష్లో రాసి ఆపై ఆ అక్షరాలపైనే తాజ్ మహల్ స్కెచ్ను పర్ఫెక్ట్గా వేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజ్మహల్ను అక్దేవ్ అచ్చుగుద్దినట్టు డ్రా చేయడంతో వీడియో ముగుస్తుంది.
ఆర్టిస్ట్ తాజ్మహల్ చిత్రాన్ని గీసిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. మీకు చాలా టాలెంట్ ఉందని ఓ ఇన్స్టాగ్రాం యూజర్ రాయగా, ఈ స్కెచ్ అద్భుతమని మరో యూజర్ కామెంట్ చేశారు. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా పేరొందిన తాజ్ మహల్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు.