లక్నో: తల్లితో గొడవ కారణంగా ఒక వ్యక్తి విషం తాగి చనిపోయాడు. అయితే కుమారుడి మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. తల్లి, కుమారుడి మృతదేహాలను పోస్ట్మార్టం కోసం తరలించారు. (Son suicide, mother hangs) ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 21 ఏళ్ల వివేక్ కుమార్ శుక్రవారం సాయంత్రం 55 ఏళ్ల తల్లి గుడ్డిదేవితో గొడవపడ్డాడు. ఆ తర్వాత విషం సేవించి సూసైడ్ చేసుకున్నాడు.
కాగా, ఇంట్లో కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి షాక్ అయ్యింది. తీవ్ర దుఃఖానికి లోనైన ఆమె చీరతో ఉరి వేసుకున్నది. తల్లి, కుమారుడి ఆత్మహత్యల గురించి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ఇంటికి చేరుకున్నారు. చట్టపరమైన లాంఛనాల తర్వాత ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
help steals gold, cash | బంగారు నగలు, నగదు చోరీ చేసిన పనిమనిషి.. 15 కుక్కలతో ఇంటిని కోటలా మార్చింది
Woman kills live-in partner | వేధింపులు భరించలేక.. సహజీవనం చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపిన మహిళ
Groom Shot Dead | ఊరేగింపుగా పెళ్లికి వెళ్తున్న వరుడు.. కాల్పులు జరిపి హత్య