లక్నో: ఒక వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలైన వరుడు కారులోనే కుప్పకూలి మరణించాడు. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బదౌర్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఆజాద్ బింద్ శుక్రవారం పెళ్లికొడుకుగా ముస్తాబయ్యాడు. తన బంధువులతో కలిసి ఊరేగింపుగా కారులో పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు.
కాగా, శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ముఖానికి ముసుగులు ధరించిన వ్యక్తులు బైక్పై వచ్చారు. బీబీపూర్ గ్రామం సమీపంలో వరుడు ఉన్న కారును అడ్డగించారు. ఆజాద్ బింద్పై పలు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన పెళ్లికొడుకు ఆ కారులో కుప్పకూలి మరణించాడు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వధువు బంధువైన ప్రియుడు వరుడ్ని హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వధువు మొబైల్ ఫోన్ కాల్స్ పరిశీలిస్తామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
IIT Jodhpur | ఐఐటీ జోధ్పూర్లో తాగునీటి సమస్య.. వాటర్ ట్యాంకర్ వద్ద క్యూ కట్టిన విద్యార్థులు