ముంబై: లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ఒక వ్యక్తి అంతా చూస్తుండగా డ్రగ్స్ సేవించాడు. (Man Consumes Drugs in Train) ఒక ప్రయాణికుడు తన మొబైల్ ఫోన్లో రహస్యంగా దీనిని వీడియో తీశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు స్పందించారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 1న అర్ధరాత్రి వేళ ఒక యువతి, ఐదుగురు యువకులున్న బృందం లోకల్ ట్రైన్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి చేతిలో ఉన్న డ్రగ్స్ను మరో వ్యక్తి పీల్చాడు.
కాగా, ఆ లోకల్ ట్రైన్లో ప్రయాణించిన ఆదర్శ్ అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్లో దీనిని రహస్యంగా వీడియో తీశాడు. వారి జేబుల్లో మరిన్ని డ్రగ్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. నాలాసోపరా స్టేషన్లో వారు ట్రైన్ దిగి వెళ్లిపోయినట్లు ఎక్స్లో పోస్ట్ చేశాడు. ముంబై పోలీసులకు దీనిని ట్యాగ్ చేశాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబై పోలీసులు, రైల్వే అధికారులకు షేర్ చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు స్పందించారు. తగిన చర్యల కోసం సంబంధిత అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు పశ్చిమ రైల్వే ఆర్పీఎఫ్ పేర్కొంది.
@Mumbai_police_ In Local train Guys Taking drugs they have Many drugs in pocket and they have Group of 6 guy and 1 Girls also In there They all Are Get AWAY in nalasopara station date 1/09/2023 time 1:25AM night 🌉 pic.twitter.com/9QjJS6LMsW
— ADARSH (@ADARSH7355) August 31, 2023
Matter has been notified to concerned officials for necessary action.
— RPF MUMBAI CENTRAL DIVISION (@rpfwrbct) September 2, 2023