కోల్కతా : బెంగాల్లోని రాజ్భవన్ ఉద్యోగినిపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులో కోల్కతా పోలీసుల నేతృత్వంలో ఏర్పాటైన స్పెషల్ ఎంక్వైరీ టీమ్ (ఎస్ఈటీ) శనివారం నలుగురు రాజ్భవన్ ఉద్యోగులకు సమన్లు పంపింది. డీసీ ఇందిరా ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటైన ఈ బృందం శుక్రవారమే దర్యాప్తు ప్రారంభించింది.
సీసీ టీవీ ఫుటేజ్లు సమర్పించాలని రాజ్భవన్ వర్గాలకు ఆదేశాలు జారీచేసింది. కాగా, ఆరోపణలు వచ్చినప్పటికీ గవర్నర్పై క్రిమినల్ చర్యలు చేపట్టలేరని ఒక అధికారి తెలిపారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆయన చెప్పారు.