న్యూఢిల్లీ, మే 4: దక్షిణ ఢిల్లీ స్థానం నుంచి రజన్ సింగ్(26) అనే థర్డ్ జెండర్ వ్యక్తి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ధోతి, టోపి ధరించిన రజన్ శుక్రవారం ఒంటరిగా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. బీహార్కు చెందిన రజన్ సింగ్ ఢిల్లీలో స్థిరపడ్డారు.
థర్డ్ జెండర్ వ్యక్తుల సమస్యలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడానికే తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు రజన్ తెలిపారు. దేశంలో పశువుల సంరక్షణకు కూడా సంక్షేమ బోర్డులు ఉన్నాయి కానీ థర్డ్ జెండర్ వ్యక్తుల కోసం పని చేసే వ్యవస్థ లేదని వాపోయారు. కేవలం పత్రాల్లో మాత్రమే వారికి గుర్తింపు ఉందన్నారు.