ఏ కష్టం వచ్చిందో తెలియదు కానీ ఒక 26 ఏళ్ల కుర్రాడు ఉరేసుకొని చనిపోయాడు. అది చూసిన అతని తల్లి అటు నుంచి అటే వెళ్లి బావిలో దూకి కన్నుమూసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్లో వెలుగు చూసింది. ఇక్కడి కాండ్రే భూర్ గ్రామానికి చెందిన శైలేష్ పాటిల్ (26) తన ఇంటికి సమీపంలోనే ఉన్న ఒక చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు.
అది చూసిన అతని తల్లి కల్పన పాటిల్ (40) దగ్గరలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం పోలీసులకు తెలిసేలోపే ఆ కుటుంబం ఇద్దరికీ అంత్యక్రియలు చేసేసింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.