న్యూఢిల్లీ: ఒక వ్యక్తి విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. (man climbs electric pole) ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో మాట్లాడేందుకు తనను అనుమతించాలని డిమాండ్ చేశాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చివరకు ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. బుధవారం ఉదయం పది గంటల సమయంలో ఢిల్లీలోని యమునా ఖాదర్ ప్రాంతంలోని హైటెన్షన్ వోల్టేజీ విద్యుత్ స్తంభంపైకి ఒక వ్యక్తి ఎక్కాడు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అతిషి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్తో మాట్లాడించాలని డిమాండ్ చేశాడు. దేశ రాజధానిలో గాలి, నీటి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది.
కాగా, ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. చివరకు ఆ వ్యక్తిని హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైనుంచి కిందకు దించారు. తాను టీచర్ అని ఆ వ్యక్తి తెలిపాడని, కాసేపు బెంగాల్, ఆ తర్వాత బీహార్కు చెందినట్లుగా అతడు చెప్పాడని పోలీస్ అధికారి తెలిపారు. అయితే అతడు ఏ ప్రాంతం వాడు, ఎందుకు ఇలా చేశాడన్న దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆ వ్యక్తి హైటెన్షన్ కరెంట్ పోల్ పైకి ఎక్కిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Delhi | An unidentified man has climbed up a high-voltage electric pole in the Yamuna Khadar area under Geeta Colony PS limits. Police and Fire Brigade personnel are present on the spot to bring him down safely. pic.twitter.com/xA0fvzit4G
— ANI (@ANI) October 23, 2024