లక్నో, ఏప్రిల్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో దవాఖానకు తీసుకెళ్లిన ఘటన బీజేపీ పాలిత యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే, అక్కడి డాక్టర్లు జిల్లా దవాఖానకు తీసుకెళ్లాలని ప్రజాపతికి సూచించారు.
జిల్లా దవాఖానకు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు దవాఖాన సిబ్బంది అంబులెన్స్ సమకూర్చలేదని ప్రజాపతి వాపోయాడు.