భోపాల్, జూన్ 9: దవాఖానల్లో ఆత్మీయులు మరణించడం తీవ్రమైన వేదన కలిగించే విషయం. అలా మరణించినవారి మృతదేహాలను అంబులెన్స్లు అందుబాటులో లేని కారణంగా కుటుంబ సభ్యులే భుజాల మీద మోసుకుంటూ తీసుకెళ్లాల్సి రావడం మరీ దయనీయం. అంబులెన్స్ లేక నాలుగేండ్ల మేనకోడలి శవాన్ని ఓ వ్యక్తి భుజాలపై మోసుకుంటూ ఇంటికి తీసుకువెళ్లాడు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఛాతర్పూర్ జిల్లా బక్స్వాహ పట్టణంలో ఈ ఘటన జరిగింది.
అంబులెన్స్ల సమస్యపై ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో మాట్లాడుతానని స్థానిక వైద్యాధికారి చెప్పారు. కాగా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లోని సర్గుజాలో ఇలాంటి హృదయవిదారక ఘటనే చోటుచేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అనారోగ్యంతో కన్నుమూసిన ఏడేండ్ల కూతురి శవాన్ని ఇంటికి చేర్చేందుకు అంబులెన్స్ సకాలంలో రాకపోవడంతో తండ్రి భుజాల మీద మోసుకువెళ్లాల్సి వచ్చింది.