లక్నో: అనారోగ్యంతో ఉన్న భార్య మంచంపై మల విసర్జన చేసింది. ఆగ్రహించిన భర్త ఆమెను కొట్టి చంపాడు. (Man Beats ill Wife To Death) ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుతుబేషర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ శారదా నగర్లో 29 ఏండ్ల అల్కా, 30 ఏండ్ల సందీప్ దంపతులు ఒక ఇంట్లో నివసిస్తున్నారు. పెళ్లి జరిగి పదేళ్లు అయినా వారికి సంతానం కలుగలేదు. అయితే అల్కా అనారోగ్యంపై భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
కాగా, గురువారం రాత్రి అనారోగ్యంతో ఉన్న అల్కా మంచంపైనే మల విసర్జన చేసింది. దీంతో భర్త సందీప్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఆమెను కొట్టి చంపాడు. గమనించిన పొరుగున ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఆ ఇంటికి చేరుకున్నారు. భార్య మృతదేహం పక్కనే కూర్చొని ఉన్న భర్త సందీప్ను అరెస్ట్ చేశారు. పోస్ట్మార్టం కోసం అల్కా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.