స్వర్ణ దేవాలయంలోకి ఓ ఆగంతకుడు చొరబడి, గురుగ్రంథ సాహిబ్ను అగౌరవ పరచడానికి ప్రయత్నించిన ఘటన మరువక ముందే పంజాబ్లో మరో ఘటన జరిగింది. కపూర్తలో జిల్లాలోని నిజాంపూర్ గురుద్వారలో సిక్కు మతపరమైన జెండాను తొలగించడానికి ఓ ఆగంతకుడు ప్రయత్నించాడు. దీంతో భక్తులు ఆయన్ను చితకబాదారు. దీంతో ఆ ఆంగతకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం 4 గంటల ప్రాంతంలో జరిగిందని, తమ జెండాను తొలగించడానికి ఆ ఆగంతకుడు ప్రయత్నించాడని భక్తులు పేర్కొంటున్నారు. పోలీసులతో పాటు మరెవ్వరు కూడా ఇందులో జోక్యం చేసుకోరాదని, పోలీసులు, ప్రభుత్వం సమానంగా బాధ్యత వహించాలని గురుద్వారా డిమాండ్ చేసింది.