ముంబై: ఒక వ్యక్తిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అతడ్ని కిడ్నాప్ చేశారు. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముంబై సమీపంలోని వసాయిలో ఒక వాహనంలో కొందరు వెళ్తుండగా మరో వాహనంలో వచ్చిన వారు దానిని ఢీకొట్టి నిలువరించారు. అనంతరం ఆ వాహనం నుంచి దిగిన కొందరు మరో వాహనంలోని వ్యక్తిపై దాడి చేశారు. అతడ్ని వాహనం నుంచి బయటకు లాగి కత్తితో దాడి చేశారు. కాపాడేందుకు ప్రయత్నించిన స్థానికులను కత్తి చూపి బెదిరించారు. మరో వ్యక్తి గన్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం కత్తి దాడిలో గాయపడిన వ్యక్తిని తమ వాహనంలోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు.
కాగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢీకొన్న వాహనం, నిందితులు అక్కడ పడేసిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కత్తి దాడిలో గాయపడి, కిడ్నాప్ అయిన వ్యక్తిని హర్జీత్ సింగ్గా గుర్తించారు. అతడి వర్గం, మరో వర్గం పంది మాంసం వ్యాపారం చేస్తుంటారని, వ్యాపార విభేదాల వల్ల ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. మరోవైపు అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
On CCTV, Man Attacked With Sword Near Mumbai Allegedly Over Trade Dispute https://t.co/GlCJdZZ8wK pic.twitter.com/Y7ssLPxKYp
— NDTV (@ndtv) December 21, 2022