ఇటీవల తమిళనాడులో వాయుసేన హెలికాప్టర్ కూలి, భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్ మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావత్ మృతిపై సోషల్ మీడియా వేదికగా కొందరు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలా చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని ఇటీవలే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హెచ్చరికలు చేశారు.
ఈ నేపథ్యంలోనే రావత్ మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. వసంత్ కుమార్ టీకే అనే వ్యక్తి మైసూరుకు చెందినవాడని, బెంగళూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడని అధికారులు తెలియజేశారు.
వసంత్ కుమార్ వయసు నలభై సంవత్సరాలని సమాచారం. రావత్ మృతిపై ఫేస్బుక్ వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 505 కింద కేసులు నమోదయ్యాయి. వారిలో వసంత్ కుమార్ కూడా ఒకడని తెలుస్తోంది.