కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా నెల రోజులుగా నిరసన చేస్తున్న జూనియర్ డాక్టర్లను సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆశ్చర్యపరిచారు. శనివారం ఉదయం వారు నిరసన చేస్తున్న వేదిక వద్దకు ఆమె వెళ్లారు. సమ్మె విరమించి విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను కోరారు. వ్యతిరేక నినాదాల మధ్య బెంగాలీలో మమత మట్లాడారు. ‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆపై నినాదాలు చేయండి. అలా చేయడం మీ ప్రజాస్వామ్య హక్కు. నేను చాలా కాలం ఎదురు చూస్తున్నా. నా భద్రతా అధికారుల సలహాకు వ్యతిరేకంగా, మీ నిరసనకు సెల్యూట్ చేయడానికి నేను ఇక్కడకు వచ్చా. నా పోస్ట్ పెద్ద విషయం కాదని నాకు తెలుసు. మీ వాయిస్ ముఖ్యం’ అని అన్నారు.
కాగా, జూనియర్ డాక్టర్లు భారీ వర్షంలో రోడ్డుపై నిరసనలు చేస్తుంటంతో తాను కూడా నిద్రలేని రాత్రులు గడిపానని మమతా బెనర్జీ తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలిస్తానని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తాను ముఖ్యమంత్రిగా కాకుండా ‘దీదీ’గా డాక్టర్లను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. ‘మీ నిరసన ఉద్దేశం నాకు అర్థమైంది. నేను కూడా విద్యార్థి నాయకురాలిని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. మీకు న్యాయం చేస్తా. మీ సహాయం లేకుండా సీనియర్ వైద్యులు పని చేయలేరు. విధుల్లో చేరాలని మిమ్మల్ని కోరుతున్నా. మీపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని నేను హామీ ఇస్తున్నా’ అని అన్నారు. అయితే తమ ఐదు డిమాండ్లపై లైవ్లో చర్చలు జరిగే వరకు రాజీపడే ప్రసక్తే లేదని ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు మీడియాతో అన్నారు.
#WATCH | Kolkata: West Bengal CM Mamata Banerjee says, “I have come forward by leading the student movement, I have also struggled a lot in my life, I understand your struggle. I am not worried about my position. It rained all night yesterday, you were sitting here protesting, I… pic.twitter.com/uZ7dThEJ77
— ANI (@ANI) September 14, 2024