సల్బొని: జాతుల మధ్య ఘర్షణలను రెచ్చ గొట్టడం ద్వారా పశ్చిమ బెంగాల్లో మణిపూర్ తరహా పరిస్థితులను ఏర్పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్లో జాతుల మధ్య ఘర్షణకు ఆజ్యం పోయాలనుకునేవారిని సహించమన్నారు.
రాష్ట్ర మంత్రి బిర్బహా హసందా వాహనంపై దాడి చేసింది కుర్మి వర్గం వారు కాదని, వారు బీజేపీ కార్యకర్తలని ఆమె తెలిపారు.