బిర్భుమ్ (పశ్చిమ బెంగాల్), జనవరి 30: ప్రమఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఇలాంటి మేధావిపై భూమి ఆక్రమించాడంటూ చిల్లర ఆరోపణలు చేసి అవమానించడం బీజేపీకి తగదని, యూనివర్సిటీని కాషాయమయం చేస్తున్నారని మండిపడ్డారు. బిర్భుమ్లో పూర్వికుల ఇంటిలో నివాసముంటున్న అమర్త్యసేన్ను ఆమె సోమవారం కలిసి మద్దతు తెలిపారు.
ఆ భూమికి సంబంధించిన రికార్డులను ఆయనకు అందజేశారు. ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. వివాదాన్ని కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ విశ్వభారతిని మొత్తం కాషాయమయం చేశారని విమర్శించారు. తాము రికార్డులను పరిశీలించగా 1.38 ఎకరాలు అమర్త్యసేన్వేనని నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు.