ప్రధాని నరేంద్ర మోదీని త్వరలోనే కలుస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. త్వరలో ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానికి కలిసి బీఎస్ఎఫ్ జ్యూరిస్డిక్షన్, త్రిపుర హింసాకాండ తదితర అంశాలపై ఆయనతో చర్చిస్తానని మమత చెప్పారు. ఈ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతానని స్పష్టం చేశారు.
త్రిపురలో పోలీసుల క్రూరత్వంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హోంశాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో మమత చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. కాగా, పోలీసు స్టేషన్కు వెళ్లిన తమపై బీజేపీ గూండాలు దాడి చేశారంటూ టీఎంసీ ఎంపీ ఇటీవలే సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన సంగతి కూడా తెలిసిందే.