న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మద్దతిస్తే తాము అధికార పగ్గాలు చేపడతామని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. విపక్ష ఇండియా కూటమికి మీరు సారధ్యం వహిస్తారా అని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ప్రశ్నించగా దీదీ ఈ మేరకు బదులిచ్చారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘేతో మమతా బెనర్జీ బుధవారం సమావేశమయ్యారు.
ఈ ఏడాది నవంబర్లో జరిగే బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023కు హాజరు కావాలని ఆయనను దీదీ ఆహ్వానించారు. మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్లో 12 రోజుల పర్యటనలో ఉన్నారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ లాంజ్లో శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘే తనను కలిశారని, తాము కొద్దిసేపు సంప్రదింపులు జరిపామని, బెంగాల్ బిజినెస్ సమ్మిట్కు తాను ఆయనను ఆహ్వానించానని మమతా బెనర్జీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు.
విక్రమ్ సింఘే తనను శ్రీలంక పర్యటనకు ఆహ్వానించారని ఆమె తెలిపారు. మరోవైపు సీట్ల సర్ధుబాటుపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలోని శరద్ పవార్ నివాసంలో భేటీ కానుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రచార ఏర్పాట్లు, ర్యాలీల నిర్వహణపైనా ఈ సమావేశంలో విపక్ష నేతలు చర్చించనున్నారు.
Read More :
Rajasthan Road Accident | ఫ్లైఓవర్పై ఆగివున్న బస్సును ఢీకొట్టిన లారీ.. 11 మంది దుర్మరణం