CM Mamata | కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. మంత్రుల శాఖలకు సంబంధించి సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలువురి శాఖలను మార్చారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఇంద్రానిల్ సేన్ను పర్యాటక శాఖ మంత్రిగా నియమించారు.
పర్యాటక శాఖ మంత్రిగా బాబుల్ సుప్రియోను.. ఆ శాఖల నుంచి తప్పించి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలు కట్టబెట్టారు. అటవీ శాఖ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్కు అదనంగా ఇండస్ట్రీయల్ రీకన్స్ట్రక్షన్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల బాధ్యతలు అప్పజెప్పారు. ప్రదీప్ ముజాందర్కు అదనంగా కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ శాఖను కేటాయించారు. అరూప్ రాయ్ను సహకార మంత్రిత్వ శాఖ నుండి తొలగించి వ్యవసాయ మార్కెటింగ్, ఉద్యానవన శాఖకు కేటాయించారు.