కోల్కతా: భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు చేసినా ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహంతో ప్రశ్నించారు. కోల్కతాపై దాడి చేస్తామని పాక్ ప్రకటించినా మౌనంగా ఉన్న ప్రధాని వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నదియా జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ‘మోదీ ఎన్నికల ప్రచారంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు కానీ పాక్ మంత్రి వాగుడుపై మాత్రం నోరెత్తరు.
బెంగాల్ ఎన్నికల సభల్లో ప్రధాని ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావించరు? పాక్పై కఠిన చర్య తీసుకుంటామని ఎందుకు ప్రకటించరు?’ అని మోదీ కూచ్ బెహర్ సభను ఉద్దేశించి ప్రశ్నించారు. కోల్కతాపై బెదిరింపులకు పాల్పడటాన్ని దేశంపై బెదిరింపులుగానే తాము పరిగణిస్తామని పేర్కొన్న ఆమె.. ‘మేము భారత్పై బెదిరింపులను సహించం.. అలాగే కోల్కతాపై కూడా’ అని అన్నారు.