కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ జానపద కళాకారులతో చేయి చేయి కలిపి డ్యాన్స్ చేశారు. ఈ వేడుకల్లో మమతా బెనర్జీ జానపద కళాకారులతో కలిసి నృత్యాలు చేస్తుండటం ఓ వీడియోలో కనిపించింది.
#WATCH | West Bengal CM Mamata Banerjee joins the folk artists as they perform at the #IndependenceDay celebrations in Kolkata.#IndiaAt75 pic.twitter.com/9bvyxFm4qz
— ANI (@ANI) August 15, 2022
జానపద కళాకారుల బృందంతో నృత్యం చేస్తున్న సమయంలో అక్కడున్న వారంతా లేచి నిల్చుని అభినందనలు తెలిపారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మమతా బెనర్జీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య వజ్రోత్సవ వేళ స్వాతంత్ర్య స్ఫూర్తితో భారత్ జాగృతం కావాలని ఆమె పిలుపు ఇచ్చారు.
మన వారసత్వ ఫలాలను ఆకాంక్షలను ముందు తరాల వారికి అందించేందుకు మనం పునరంకితం కావాలని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుతూ మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.