కోల్కతా, ఫిబ్రవరి 17: ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోని కాన్పూరు జిల్లాలో ఆక్రమణల తొలగింపు పేరిట పేదల ఇళ్లు తొలగిస్తుండగా ఈ నెల 13న తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నారని ఆమె చెప్పారు.
ఏ చిన్న సంఘటన జరిగినా బెంగాల్కు కేంద్ర బృందాలను పంపే మోదీ ప్రభుత్వం యూపీలో జరిగిన ఈ సంఘటనపై ఎందుకు స్పందించలేదని శుక్రవారం బంకురలో పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఆమె ప్రశ్నించారు.