భువనేశ్వర్, మార్చి 23: దేశంలో బలమైన, స్థిరమైన సమాఖ్య వ్యవస్థ నిర్మాణానికి కలిసి పనిచేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. గురువారం నవీన్ నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు.
అనంతరం నవీన్ పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ తమది మర్యాదపూర్వక సమావేశమేనని, తీవ్రమైన రాజకీయ అంశాలేవీ చర్చించలేదన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాలని ఇద్దరం తీర్మానించుకున్నట్టు చెప్పారు. అనంతరం మమత మాట్లాడుతూ.. నవీన్జీ చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నట్టు తెలిపారు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఇరువురు నేతలు సమాధానం దాటవేశారు.