బెంగళూర్ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బళ్లారిలో శనివారం రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా వ్యవహరించిన ఖర్గే ప్రస్తుతం లోక్సభలో కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తున్నారు.
సొంత రాష్ట్రంలో రాహుల్ పాదయాత్రలో తొలిసారిగా పాలుపంచుకున్న ఖర్గే బళ్లారిలో జరిగిన మెగా ర్యాలీలోనూ పాల్గొన్నారు. సెప్టెంబర్ ౩౦న కర్నాటకలో ప్రవేశించిన భారత్ జోడో యాత్ర 21 రోజుల పాటు 511 కిలోమీటర్ల పొడవున సాగుతూ అక్టోబర్ 20న ముగియనుంది.
ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఖర్గే మరో సీనియర్ నేత శశి థరూర్తో పోటీ పడుతున్నారు. 1972లో రాజకీయాల్లో ప్రవేశించిన ఖర్గే 2008 వరకూ ఏకంగా పది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009 నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.