Congress | కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే యూపీలో పలు ర్యాలీల్లో పాల్గొన్నారని, గత నెల రోజులుగా యూపీలో పర్యటిస్తూనే వున్నారన్నారు. పాలక పక్షానికి వచ్చిన పెద్ద నష్టమేమీ లేదని, పాలక పక్షం చాలా సేఫ్గానే ఉందన్నారు. అటొచ్చీ, ఇటొచ్చీ ఆర్థికంగా బలహీనతల్లో ఉన్న పార్టీలకే ఇబ్బందులని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ శనివారం ప్రకటించింది. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర ఈ షెడ్యూల్ను ప్రకటించారు. మొత్తం ఏడు దశల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఈ ఎన్నికలు జరుగుతాయని, మార్చి 10న తుది ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి సుశీల్ చంద్ర ప్రకటించారు. అతి పెద్ద రాష్ట్రమైన యూపీలో 7 దశల్లో ఎన్నికలు జరుగుతాయని, మణిపూర్లో 2 దశల్లో, ఇక గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్లో ఒక్కో దశలోనే ఎన్నికలు జరుగతాయని ఈసీ ప్రకటించింది.