న్యూఢిల్లీ, అక్టోబర్ 19: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ నేత మల్లికార్జున్ ఖర్గే ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం ఖర్గే, శశిథరూర్ పోటీపడగా.. ఖర్గేకు 7,897 ఓట్లు, థరూర్కు 1,072 ఓట్లు వచ్చాయి.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు.. అధ్యక్ష పదవిలో కొనసాగడానికి సోనియా విముఖత చూపడం.. పగ్గాలు చేపట్టడానికి రాహుల్గాంధీ ఆసక్తి చూపకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.