తిరువనంతపురం : ప్రముఖ మళయాళ నటుడు (Malayalam actor) కొల్లం సుధి (39) సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ దుర్ఘటనలో ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నముగ్గురు మిమిక్రీ ఆర్టిస్టులు బిను ఆదిమల్లు, ఉల్లాస్, మహేష్ గాయపడ్డారు. కేరళలోని కైపమంగళం ప్రాంతంలో ఉదయం 4.30 గంటలకు రోడ్డు ప్రమాదం వాటిల్లింది.
వటకరలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో సుధి తలకు బలమైన గాయమైంది. కొడుంగల్లూర్లోని ఆస్పత్రికి నటుడిని తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కొడుంగల్లూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. సుధి మరణం పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సుధి 2015లో తన సినీ కెరీర్ను ప్రారంభించారు. కట్టప్పనలియె రిత్విక్ రోషన్, కుట్టనందన్ మర్పప్ప వంటి పలు సినిమాల్లో నటించారు. పలు టీవీ షోలు, స్టేజ్ షోలపై సుధి తన నటన, మిమిక్రీతో ప్రేక్షకులను అలరించారు. సుధి మరణ వార్తను తెలుసుకున్న పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నటుడి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More