ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన నేపథ్యంలో ఎలన్ మస్క్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫర్ ఇచ్చారు. భారత్లో టెస్లా కార్లు తయారు చేయవచ్చంటూ ఆహ్వానం పలికారు. ఎలన్ మస్క్ టెస్లా కార్లను భారత్లో తయారు చేయాలనుకుంటే తమకు ఇబ్బందేమీ లేదని గడ్కరీ ప్రకటించారు.
ఇక.. ఎలన్ మస్క్ భారత్లో పర్యటించాలని నితిన్ గడ్కరీ కోరారు. ఎలన్ మస్క్ వచ్చి, ఇక్కడ మ్యానిఫ్యాక్చరింగ్ ప్రారంభించాలని ఆయన కోరారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అని, పోర్టులు కూడా అందుబాటులో వున్నాయని గడ్కరీ వివరించారు. భారత్ నుంచి ఎగుమతులు చేయవచ్చని, అయితే… మేడిన్ చైనా టెస్లాకు మాత్రం ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు.
ఎలన్ మస్క్ను భారత్కు స్వాగతిస్తున్నాం. అయితే చైనాలో తయారు చేసి, భారత్లో విక్రయించాలనుకుంటే మాత్రం మేం ఒప్పుకోం. మీరు భారత్కు రావాలి. మీకు స్వాగతం. భారత్లోనే మ్యానిఫ్యాక్చరింగ్ చేయాలి అని నితిన్ గడ్కరీ కోరారు.