Srishti Khullar: ఈ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో అందరూ మహిళలే ఉన్న పటాలం పాల్గొననుంది. ఇలా అందరూ మహిళలే ఉన్న పటాలం భారత రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కు చెందిన ఈ ఆల్-విమెన్ కాంటింజెంట్కు కంటి వైద్యురాలు, పారా ట్రూపర్ అయిన మేజర్ శ్రిష్ఠి ఖుల్లర్ నేత్వత్వం వహించనున్నారు.
రిపబ్లిక్ డే వేడుక పరేడ్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కు చెందిన ఆల్ విమెన్ కాంటింజెంట్కు నేతృత్వం వహించే అవకాశం దక్కడంపై మేజర్ శ్రిష్ఠి ఖుల్లర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఒక కంటి వైద్యురాలిగా ఆపరేషన్ థియేటర్లో నేను సర్జికల్ కత్తిని పట్టుకుంటా. కానీ ఇప్పుడు రిపబ్లిక్ డే పరేడ్లో ఖడ్గాన్ని పట్టుకోవాల్సి రావడం పెద్ద సవాలే. కానీ ఇది నాకు ఎంతో గర్వకారణం. నాకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.’ అని ఆమె చెప్పారు.
#WATCH | Major Srishti Khullar— an eye surgeon and a paratrooper, is leading the first ever all-women contingent of Armed Forces Medical Services taking part in the Republic Day parade.
She says, “Being an eye surgeon, I have been used to holding a surgical knife in the… pic.twitter.com/C7hQNJrvAy
— ANI (@ANI) January 23, 2024