న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఉన్నత పాఠశాల సైన్స్ పరిశోధనా రంగంలో భారతీయ సంతతికి చెందిన మైత్రేయ ధరణి అరుదైన విజయాన్ని సాధించాడు. న్యూజెర్సీలోని సొసైటీ ఫర్ సైన్స్ నిర్వహించే ప్రతిష్టాత్మకమైన రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ సెర్చ్లో 18 ఏండ్ల మైత్రేయ ధరణి అద్భుత ప్రతిభను కనబరిచాడు.
సిస్సాటిన్ అనే కీమోథెరపీ ఔషధానికి ఒక్కో కణితి ఎలా స్పందిస్తుందో అంచనా వేయడానికి ఒక కృత్రిమ మేధ(ఏఐ) నమూనాని అతను అభివృద్ధి చేశాడు. ఆ యువకుడి ప్రాజెక్ట్ 2026 రీజెనెరాన్ ఎస్టీఎస్లో అతడిని టాప్ 40 ఫైనలిస్టులలో ఒకరిగా నిలిపింది. ప్రతి రోగికి ఉత్తమమైన చికిత్సలను ఎంచుకోవడంలో వైద్యులకు సహాయపడేందుకు మెషిన్ లెర్నింగ్, జన్యుపరమైన డేటాను మిళితం చేస్తుంది.