Mahua Moitra : బహిష్కృత లోక్సభ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫారెన్ ఎక్స్ఛేంజ్ నిబంధనల ఉల్లంఘన కేసులో ప్రశ్నించేందుకు ఆమెకు ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో సోమవారం ఢిల్లీలోని ఏజెన్సీ కార్యాలయం ఎదుట హాజరు కావాలని మహువ మొయిత్రకు జారీ చేసిన సమన్లలో ఈడీ కోరింది.
కాగా ప్రశ్నలకు నగదు స్వీకరించారనే ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా తృణమూల్ ఎంపీ మహువ మొయిత్ర గత ఏడాది డిసెంబర్లో లోక్సభ నుంచి బహిష్కరణ వేటును ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. తనను లోక్సభ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం ఈ పిటిషన్ పెండింగ్లో ఉంది.
Read More :
MLC Kavitha | వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలి : ఎమ్మెల్సీ కవిత