1931లో గాంధీజీ రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్ వెళ్లినప్పుడు పలువురు బ్రిటిష్ రాజకీయ, సాంస్కృతిక రంగాల ప్రముఖులు ఆయనను కలిశారు.
వారిలో ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ కూడా ఉన్నారు. సమావేశం తర్వాత బయటికి వచ్చిన చాప్లిన్ను లోపల ఏం జరిగింది? అని మీడియా అడిగితే.. ‘నేను ప్రపంచాన్ని నవ్విస్తాను.. కానీ ఈయన నన్నే నవ్వించారు’ అని తనదైన శైలిలో సమాధానమిచ్చారట.