ముంబై: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య
పెరుగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 57,640 కేసులు నమోదు కాగా, 920 మంది ప్రాణాలు కోల్పోయారు. 57,006 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క ముంబైలోనే 3,879 మందికి వైరస్ సోకింది. గడచిన 24 గంటల్లో 77 మంది మృతి చెందారు. మరో 3,686 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రలో కొవిడ్ వివరాలు:
మొత్తం కేసులు:48,80,542
యాక్టివ్ కేసులు:6,41,596
మరణాలు:72,662