ముంబై: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివ సైనికులు రగిలిపోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులనుద్దేశించి సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం అనంతరం శివసేన కార్యకర్తలు కొత్త ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. వారి కటౌట్లు, పోస్టర్లను చించివేస్తున్నారు.
తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యే మంగేష్ కుందాల్కర్ ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ను శివసేన కార్యకర్తలు శుక్రవారం ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ నిలువరించలేకపోయారు. అలాగే శుక్రవారం రెబల్ గ్రూప్లో చేరిన ఎమ్మెల్యే దిలీప్ లాండేకు చెందిన కటౌన్ను ధ్వంసం చేశారు.
మరోవైపు శివసైనికుల ఆగ్రహావేశాల నేపథ్యంలో మహారాష్ట్ర పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, ముఖ్యంగా ముంబైలోని అన్ని పోలీసు స్టేషన్లు హై అలర్ట్గా ఉండాలని వారికి ఆదేశాలు అందాయి. శివసైనికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగే అవకాశమున్నదని పోలీసులకు సమాచారం అందింది. దీంతో శాంతి భద్రతలు నెలకొనేలా చూసేందుకు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.
#WATCH | Maharashtra | Office of rebel MLA Mangesh Kudalkar in Kurla vandalised allegedly by Shiv Sena workers today pic.twitter.com/RhVYGJVw5X
— ANI (@ANI) June 24, 2022
Maharashtra | Poster of Shiv Sena MLA Dilip Lande, who is currently camping in Guwahati with rebel party leader Eknath Shinde, smeared with ink and a poster showing his picture torn in Mumbai pic.twitter.com/XXmfCacBAc
— ANI (@ANI) June 24, 2022