ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కోయార్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను, ఝరెవాడ గ్రామంలో చేపట్టిన మరో ఆపరేషన్లో ఒక మావోయిస్టును అదుపులోకి తీసుకున్నారు.
వారిని రమేశ్ పల్లో, తాని అలియాస్ శశి పంగటి, అర్జున్ అలియాస్ మహేశ్ నరోటేగా గుర్తించారు. రమేశ్, తానీలపై రూ.4 లక్షల చొప్పున, అర్జున్పై రూ.2 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. కాగా, రమేశ్పై హత్యలు, ఎన్కౌంటర్లు సహా మొత్తం 13 కేసులు, అర్జున్.. దొంగతనం, హత్యల వంటి 24 నేరాల్లో పాలుపంచుకున్నాడని వెల్లడించారు.